AAP : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆప్ తన పార్టీ ఎంపీ స్వాతి మీదనే సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేసింది. ఘటన జరిగిన రోజుకు సంబంధించిన ఓ క్లిప్పింగ్ను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి, దానికి ‘స్వాతి మాలివాల్ కా సచ్’ అనే టెక్స్ట్ను జతచేసింది.
స్వాతి మాలివాల్పై దాడి జరిగినట్టుగా చెబుతున్న రోజున కేజ్రీవాల్ నివాసంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని స్వాతి మాలివాల్ బూతు పదజాలంతో దూషించింది. ‘గంజా సాలా’ అని వ్యాఖ్యానించింది. ఈ క్లిప్పింగ్నే ఆప్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేస్తూ.. ‘స్వాతి మాలివాల్ కా సచ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
మే 13న ఈ ఘటన జరుగగా ఈ ఐదురోజుల్లో స్వాతిమాలివాల్కు వ్యతిరేక ఆప్ నోరు విప్పడం ఇదే తొలిసారి. కాగా ఆప్ పోస్టు చేసిన వీడియో ఒరిజినలా.. నకిలీదా అనే విషయాన్ని తాము ఇంకా డిసైడ్ చేయలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, స్వాతిమాలివాల్ ఈ నెల 13 కేజ్రివాల్ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడి చేశాడని మాలివాల్ పోలిసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆప్ తొలిసారిగా మాలివాల్పై చేసింది.
स्वाति मालीवाल का सच https://t.co/TGqvnCj619
— AAP (@AamAadmiParty) May 17, 2024