చంబా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో బుధవారం రాత్రి ఓ ఎస్యూవీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. చంబా జిల్లాలోని చంబా-మసూరంద్ రోడ్డు మార్గంలో ఉన్న చాత్రుండ్ వద్ద భారీ లోయలో వాహనం పడింది. స్కిడ్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితులను కుతెడ్ గ్రామ పంచాయతీలోని మహల్ గ్రామస్థులుగా గుర్తించారు. మరో గ్రామంలో ఓ ఫంక్షన్కు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాత్రుండ్ వద్ద వాహనం డ్రైవర్ అదుపు తప్పిందని, దీంతో లోయలోకి బోల్తా కొట్టిందన్నారు. చాలా బలంగా రాళ్లను ఢీకొంటూ వాహనం లోయలో పడింది. దీంతో ఆ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.
ప్రమాద స్థలంలోనే ఆరుగురు మృతిచెందారు. ఆ తర్వాత గాయాల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు ఆడ, ముగ్గురు మగవారున్నారు. బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా డేంజర్గా ఉంటుందని, అక్కడ క్రాష్ బారియర్లు ఏమీ లేవని స్థానికులు ఆరోపించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, కానీ ప్రమాద ఘటనకు చెందిన సరైన కారణాన్ని ఇంకా గుర్తించలేదని ఎస్పీ విజయ్ సాక్లానీ తెలిపారు.