ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు లభించింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకన్నారు. అయితే ఆ బ్యాగులో ఐఈడీ బాంబులు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఐఈడీ బాంబులతో పాటు పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. దీంతో ఎన్ఎస్జీ బృందానికి సమాచారమిచ్చారు. ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి.
గాజీపూర్ ఆర్డీఎక్స్ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో సీమాపూరి ప్రాంతంలోని ఈ ఇంటి గురించే తమకు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో స్పెషల్ టీమ్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఈ ఇంటికి వచ్చారని, ఈ సమయంలోనే అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించిందని వివరించారు. అయితే ఈ ఇంట్లో నలుగురు యువకులు నివసిస్తున్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.