BJP | జైపూర్ : కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్పై అవినీతి ఆరోపణలు చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే కైలాశ్ మేఘ్వాల్పై బీజేపీ కఠిన చర్యలకు దిగింది. అర్జున్రామ్ నెంబర్ వన్ అవినీతిపరుడని కైలాశ్ ఆగస్టు 28న ఆరోపించారు. ఆ మర్నాడే ఆయనకు బీజేపీ షోకాజ్ నోటీసు పంపింది.
అయినా కైలాశ్ వెనుకంజ వేయలేదు. బుధవారం కూడా మరోసారి ఆరోపించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ నేత ఓంకార్ సింగ్ లఖ్వత్ ప్రకటించారు. కైలాశ్ గతంలో శాసనసభ సభాపతిగా పనిచేశారు.