న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సునీల్ అరోరా సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం కొత్త సీఈసీగా 13న సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. 2019 ఫిబ్రవరి 14న ఆయన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. 2022 మే 14న రిటైర్ కానున్నారు.