ముంబై : సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ మహరాజ్కు గురువు అని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ సందర్భంగా ఆమె బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ 2018, జూలై 16న ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఔరంగాబాద్లో జరిగిన కార్యక్రమంలో గురువు – శిష్యుల సంబంధాన్ని గురించి చెబుతూ శివాజీ మహరాజ్, చంద్రగుప్త మౌర్యను ఉదాహరణగా చూపారు.
ఈ భూమిపై ఎందరో మహారాజులు జన్మించారని.. చాణక్యుడు లేకుంటే చంద్రగుప్తుడు లేడని.. సమర్థ రామదాసు లేకుంటే శివాజీ లేడన్నారు. చంద్రగుప్త మౌర్య, శివాజీ మహారాజ్ల శక్తిసామర్థ్యాలను తాను ప్రశ్నించడం లేదన్న గవర్నర్.. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి ఎంతటి ముఖ్యపాత్ర వహిస్తుందో సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతేనన్నారు. ఈ క్రమంలో సుప్రియా సూలే ట్విట్టర్ వేదిక గవర్నర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా గతంలో ఇదే అంశంపై ఎన్సీపీ ఛీప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోనూ పోస్ట్ చేశారు.