న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4 నుంచి భౌతికంగా కేసులను విచారించనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బుధవారం కేసుల విచారణ ప్రారంభించడానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. న్యాయవాదులు కోరుకుంటే సోమవారం, శుక్రవారం వర్చువల్ విచారణ కోసం లింకులు అందిస్తామని సీజేఐ తెలిపారు.