న్యూఢిల్లీ, మార్చి 24: నిషేధిత సంస్థలో సభ్యత్వం కలిగి ఉండటం నేరమేనని, దీనిని దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేక చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. నిషేధిత సంస్థల్లో సభ్యత్వం ఉండటం నేరం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తోసిపుచ్చింది.
ఏదైనా సంస్థ నిషేధానికి గురైందని తెలిసిన తర్వాత కూడా దాని సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న వారు శిక్షార్హులేనని కోర్టు స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన సంస్థలో సభ్యత్వాన్ని నేరంగా పరిగణించే చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ) – 1967లోని సెక్షన్ 10(a)(i) ను కోర్టు సమర్థించింది.