ED Director | న్యూఢిల్లీ: ‘ఇతర అధికారులందరూ అసమర్థులా? ఆయన ఒక్కరే సమర్థుడా’ అంటూ ఈడీ డైరెక్టర్ పదవీ కాలం కేసులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని గురువారం నిలదీసింది. ఈడీ డైరెక్టర్గా ఎస్కే మిశ్రా పదవీ కాలాన్ని సెప్టెంబర్ 15 వరకు మాత్రమే పొడిగించడానికి అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమీక్ష సమావేశం నేపథ్యంలో మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రం కోరగా కోర్టు ఈ విధంగా స్పందించింది.
పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష ప్రక్రియ 2024 వరకు కొనసాగుతుందని… అప్పటి వరకు కేంద్రం మిశ్రా పొడిగింపును కోరుతుందా అని ప్రశ్నించారు. ‘140 కోట్ల మంది ప్రజల్లో మనం ఒక అధికారి మీదే ఆధారపడుతున్నామా?’ అని ఆయన వ్యాఖ్యానించారు.