న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. వ్యాస్ జీ కా తెహఖానా (జ్ఞానవాపి మసీదులోని దక్షిణ నేల మాళిగ)లో పూజలు చేసేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించగా, ఆ తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.