న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షాకు గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యం కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. హిమాచల్ ప్రదేశ్లో గురువారం ఈ సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా గురువారం గుండెకు సంబంధించిన ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మీడియాకు తెలిపారు. దీంతో ఆయనకు వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన సుప్రీంకోర్టు అధికారులు కూడా న్యాయమూర్తి ఎంఆర్ షాకు మెరుగైన వైద్యం కోసం హోంమంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీకి తరలించి చికిత్స అందించాలని కోరారు. కాగా, సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
64 ఏండ్ల జస్టిస్ ఎంఆర్ షా, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా. 2023 మే 15న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
Hon'ble Justice MR Shah Judge Supreme Court of India has suffered a heart attack while he was in Himachal Pradesh. Arrangements being made to rush him to Delhi. Praying to God for his speedy recovery. 🙏
— Gaurav Bhatia गौरव भाटिया (@gauravbh) June 16, 2022