Supreme Court | దేశ వ్యతిరేక కార్యకలాపాలతో నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. పీఎఫ్ఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్పై మొదట హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేంద్రం నిషేధాన్ని ధ్రువీకరిస్తూ యూఏపీఏ ట్రిబ్యునల్ ఆదేశాలను పీఎఫ్ఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ ముందుగా హైకోర్టును ఆశ్రయించడం సరైందని జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది. అయితే, పీఎఫ్ఐ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సైతం మొదట హైకోర్టును ఆశ్రయించి.. ఆ తర్వాత సుప్రీంకు రావాల్సిందన్న కోర్టు అభిప్రాయంతో ఏకీభవించారు. ఐఎస్ఐఎస్ తదితర గ్లోబర్ టెర్రరిస్టు సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలున్నాయని.. దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.