న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh)కు బెయిల్ మంజూరీ అయ్యింది. ఆర్నెళ్ల తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఎక్సైజ్ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ను రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్త, ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీ అవసరం లేదని ఈడీ చెప్పడంతో కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీ అవసరమా లేదా అని ఇవాళ లంచ్ బ్రేక్కు ముందు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును కోర్టు అడిగింది. అయితే భోజన విరామం తర్వాత ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. మద్యం కేసులో సంజయ్ సింగ్ అవసరమే ఉన్నా.. ఆయన కస్టడీ అవసరం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వవచ్చు అని కోర్టుకు ఈడీ చెప్పింది. మనీల్యాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం బెయిల్ మంజూరీ చేశారు.