న్యూఢిల్లీ: అడ్వకేట్ సుధా భరద్వాజ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుధా భరద్వాజ్కు బెయిల్ ఇవ్వొద్దు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. లాయర్, సామాజిక కార్యకర్త అయిన భరద్వాజ్ను బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు. నిజానికి బాంబే హై కోర్టు ఆమెకు బెయిల్ను మంజూరీ చేసింది. కానీ ఎన్ఐఏ ఆ బెయిల్ పిటిషన్ను అడ్డుకున్నది. సుప్రీంకు వెళ్లిన ఆమెకు అక్కడ ఊరట లభించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం చెప్పింది. దీంతో రెండు ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యేందుకు మార్గం సులువైంది. ఎన్ఐఏ చేసిన వాదనలను జస్టిస్ యూయూ లలిత్, రవింద్ర భట్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.