Shivsena | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన (UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ‘శివసేన’పై తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ‘శివసేన’ రియల్ శివసేనగా స్పీకర్ నర్వేకర్ ప్రకటించారు. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, మనోజ్మిశ్రా ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా విచారించేందుకు అంగీకరించింది. పిటిషన్ను పరిశీలిస్తామన్న సీజేఐ.. జాబితా చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఇంతకు ముందు జనవరి 22న ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ పిటిషన్పై ఏక్నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేల స్పందన కోరింది.
ఈ పిటిషన్పై రెండువారాల తర్వాత విచారణ కోసం లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారని.. రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారని థాకరే వర్గం ఆరోపించింది. షిండేతో సహా అధికార శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న థాకరే వర్గం పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ నర్వేకర్ తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనర్హత పిటిషన్లపై జనవరి 10న నిర్ణయం ప్రకటించిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపై అనర్హులగా ప్రకటించలేదు. శివసేన ఏక్నాథ్ షిండేదేనని ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.