బళ్లారి, అక్టోబర్ 14: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకొన్నది. ఓ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బీకామ్ విద్యార్థిని పరీక్ష రాస్తుండగా నిందితుల్లో ఒకరు యువతి సోదరుడిని అని చెప్పి ఆమెను బయటకు పిలిచాడు.
అనంతరం నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి కొప్పల్ జిల్లాలోని సనాపురలో ఉన్న ఓ హోటల్కు తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా ఆమెతో డ్రగ్స్ కలిపిన బీర్ తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.