న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాఖర్ పార్టీలో చేరడంపై నడ్డా హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ అనుభవంతో పంజాబ్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తారని నమ్ముతున్నానన్నారు. జాఖర్ ఇటీవలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం విధితమే. ప్రముఖ హిందూ నాయకుల్లో ఒకరైన సునీల్ జాఖర్, లోక్సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖర్ తనయుడు. సునీల్ ఝాకర్ 2022-2017 వరకు అబోహర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల్లో అబోహర్ నుంచి పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎంపీ వినోద్ ఖన్నా 2017లో గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2017లో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జాఖర్ నియమితులయ్యారు.
2019లో మళ్లీ గురుదాస్పూర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ కాంగ్రెస్ గుడ్ బై చెప్పిన సునీల్ జాఖర్ ఆ పార్టీ హైకమాండ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సునీల్ జాఖర్ రాజీనామాకు స్క్రిప్ట్ ప్రారంభమైంది. 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినా సీఎంను చేయకపోవడంతో కేంద్ర నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.