న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మా తమ ఉత్పత్తుల విషయంలో కల్తీకి పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. మందుల తయారీలో ఆ సంస్థ లోపాలకు పాల్పడుతున్నట్లు ఎఫ్డీఏ ఓ రిపోర్ట్లో పేర్కొన్నది. గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో మందుల తయారీలో లోపం తలెత్తుతున్నట్లు అమెరికా సంస్థ తెలిపింది. డ్రగ్స్ తయారీ సమయంలో సూక్ష్మజీవుల కంటామినేషన్ జరగకుండా ఆ కంపెనీ చర్యలు తీసుకోవడం లేదని, డ్రగ్స్ ఉత్పత్తిలో లోపాలు తలెత్తుతున్నాయని ఎఫ్డీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో వార్నింగ్ లెటర్ను కూడా జారీ చేశారు.
సన్ ఫార్మా అనుసరిస్తున్న పద్ధతులు, సౌకర్యాలు, ఉత్పత్తిలో ప్రాసెసింగ్, ప్యాకింగ్ విధానాలన్నింటిలో కల్తీ జరుగుతున్నట్లు ఎఫ్డీఏ తన వార్నింగ్ లేఖలో పేర్కొన్నది. గుజరాత్లోని సన్ ఫార్మా కంపెనీ ప్లాంట్ను గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 9 వరకు ఎఫ్డీఏ తనిఖీ చేసింది. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ను ఇచ్చింది.