న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మా(Sun Pharma)పై రాన్సమ్వేర్ గ్రూపు అటాక్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. మార్చి రెండో తేదీన సన్ ఫార్మా కంపెనీపై ఐటీ హ్యాకింగ్ జరిగింది. అయితే ఆ దాడికి తామే బాధ్యులమని రాన్సమ్వేర్(Ransomware) ప్రకటించినట్లు సన్ ఫార్మా తెలిపింది. మార్చి రెండో తేదీన ఇన్ఫర్మేషన్ సెక్యూర్టీ చొరబాటు జరిగినట్లు కంపెనీ పేర్కొన్న విషజ్ఞం తెలిసిందే. అయితే ఆ ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఆ దాడికి పాల్పడింది తామే అని రాన్సమ్వేర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన సిస్టమ్స్పై హ్యాకర్లు అటాక్ చేశారు. కొన్ని ఫైల్ సిస్టమ్స్ను హ్యాక్ చేశారు. కంపెనీకి చెందిన పర్సనల్ డేటాను చోరీ చేసినట్లు సన్ ఫార్మా తెలిపింది. అయితే మళ్లీ ఐటీ సిస్టమ్స్ను కంటేన్ చేసినట్లు కంపెనీ చెప్పింది . ఈ ఘటన వల్ల కంపెనీ ఆదాయం పడిపోయే అవకాశాలు ఉన్నాయి.