Suicide : క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తండ్రి మందలించాడన్న కోపంతో బీబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ సింధి కాలనీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సింధి కాలనీకి చెందిన భూమిక వినోద్ ధన్వానీ బీబీఏ చదువుతున్నది. అయితే ఇటీవల ఆమెకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లు తేలింది. దాంతో చిరుతిళ్లు తినొద్దని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మంగళవారం చిరుతిళ్లు కొనుక్కుని తింటున్న భూమికను తండ్రి మందలించాడు.
దాంతో మనస్తాపానికి గురైన భూమిక కిచెన్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న ప్రతాప్ నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.