న్యూఢిల్లీ : భారత్లో పలు సబ్వే అవుట్లెట్లు (Subway India) తమ సలాడ్స్, శాండ్విచ్ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర కూరగాయ ధర ఇటీవల ఏకంగా 400 శాతానికి ఎగబాకడం, ప్రభుత్వం రంగంలోకి దిగినా టమాట ధరలు కిలో ఏకంగా రూ. 160 పలుకుతుండటంతో వంటకాల్లో టమాట కనిపించడమే గగనమైంది.
టమాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేనందున మన్నించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్లోని ఓ సబ్వే అవుట్లెట్ బోర్డును డిస్ప్లే చేసింది. తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంతగా టమాటాల సరఫరాలు లేవని అవుట్లెట్ పేర్కొంది. వీలైనంత త్వరగా టమాటాల సేకరణను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కస్టమర్లకు భరోసా ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఎన్ని అవుట్లెట్స్పై ఎఫెక్ట్ ఉంటుందనే వివరాలను సబ్వే ఇండియా వెల్లడించలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్లెట్స్లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది.
ఇక ఢిల్లీలో రెండు స్టోర్లతో పాటు యూపీలో ఒకటి, చెన్నైలో ఒక స్టోర్లో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఈ కూరగాయను కిచెన్స్ నుంచి దూరం పెట్టారు. టమాట బాగా ఖరీదైందని సబ్వే స్టోర్ ఉద్యోగి ఒకరు చెప్పుకొచ్చారు. ఇక మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఇప్పటికే తమ మెనూ నుంచి టమాటాలను తొలగించారు. నాణ్యతా ప్రమాణాలు కొరవడినందునే ఇలా చేశామని మెక్డొనాల్డ్స్ చెబుతుండగా టమాటాల ధరలు రికార్డు స్ధాయికి చేరడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. సబ్వే, మెక్డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్సీ టమాటాల వాడకం తగ్గించాయి. ఈ రెస్టారెంట్ చెయిన్స్ తక్కువ రకం టమాటాలను వాడుతున్నాయి.
Read More :