Love Affair | కోటా, జనవరి 18: ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చదువు కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని ఆయన కోరారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కొన్ని రంగాలపై ఆసక్తి ఉంటుందని, దానికి వ్యతిరేకంగా వారి లక్ష్యాలను బలవంతంగా నిర్దేశించినప్పుడే వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని అన్నారు.
కోటాలో జేఈఈకి కోచింగ్ తీసుకుంటున్న 16 ఏండ్ల మనన్ జైన్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేండ్లుగా కోటాలో ఉంటూ జేఈఈ మెయిన్కు శిక్షణ పొందుతున్న మనన్ జైన్ తెలివైన వాడని, కుటుంబ సభ్యులు తెలిపారు.