సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు అచ్చం మనిషి లాంటి రిక్షాను లాగే రోబోను తయారు చేశారు. రూ.30 వేలు వెచ్చించి, 25 రోజుల పాటు శ్రమించి వారు ఈ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చారు. బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్తాడు. ఈ రోబో తయారీలో ముఖ్య భూమిక పోషించిన మౌర్య శివమ్ మాట్లాడుతూ.. ఈ రోబో నమూనా మాత్రమేనని, దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయాల్సి ఉన్నదని వివరించాడు.