Answer Sheet | కోజికోడ్ : ఓ విద్యార్థి జవాబు పత్రంపై తప్పుగా రూల్ నంబర్ రాశాడు. దీంతో ఆ సమయంలో ఇన్విజిలేటర్గా ఉన్న టీచర్కు రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం కోజికోడ్లో ప్లస్ వన్(11వ తరగతి) పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజున ఓ విద్యార్థి తన ఆన్షర్ షీట్పై రూల్ నంబర్ తప్పుగా రాశాడు. ఆ విషయాన్ని ఇన్విజిలేటర్కు కూడా గమనించలేదు. ఆ విద్యార్థి తప్పుగా రూల్ నంబర్ రాయడంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. దీంతో ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్కు జనరల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రూ. 3 వేల జరిమానా విధించారు.
తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా, డైరెక్టర్ పట్టించుకోలేదు. జరిమానా విధించిన రూ. 3 వేలు ట్రెజరీలో కట్టాలని ఆదేశించారు. ఈ ఘటనను టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎస్ మనోజ్ ఖండించారు. చిన్న చిన్న సంఘటనలకు వేలల్లో జరిమానాలు విధిస్తూ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు విద్యాశాఖ అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారని మనోజ్ విమర్శించారు.