న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఖలిస్థానీ హత్య విషయంలో భారత్పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ ఆ దేశంలో దారుణంగా పడిపోయిందని, ఆయన రేటింగ్ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. కెనడా ప్రధానిగా ట్రూడో పనితీరు, దేశంలో నెలకొన్న సమస్యలు, భారత్-కెనడా సంబంధాలు తదితర అంశాలపై క్లాస్టర్ కన్సల్టింగ్తో కలిసి ఎన్డీటీవీ 800 మంది కెనడా పౌరులతో సర్వే చేపట్టింది.
భారత్లో కెనడా సంబంధాలు ముఖ్యమని 62 శాతం మంది అభిప్రాయపడగా, ట్రూడో ఆరోపణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని 65 శాతం మంది చెప్పారు. అదేవిధంగా దేశంలో జీవన వ్యయం, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నదని మెజార్టీ పౌరులు పేర్కొన్నారు. ప్రధానిగా ట్రూడో పనితీరుపై 54 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.