న్యూఢిల్లీ: బట్టలు విప్పి అండర్ ట్రయల్ ఖైదీలపై సోదాలు జరపటాన్ని ముంబై స్పెషల్ కోర్టు న్యాయమూర్తి బీడీ షిల్కే తప్పుబట్టారు. ఖైదీలను అలా చేయటం వారి ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుల్ని ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు.
స్కానర్లు, ఇతర పరికరాలతో సోదాలు చేపట్టాలని జైలు సిబ్బందిని ఆదేశిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ముంబై జైలు సిబ్బంది తనను నగ్నంగా మార్చి సోదాలు జరుపుతున్నారని అండర్ ట్రయిల్ ఖైదీ కమల్ షేక్ కోర్టులో ఫిర్యాదు చేశాడు.