జోగుళాంబ గద్వాల : రెండు బైక్లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 44 వ జాతీయ రహదారిపై కర్నూలు వైపు వెళ్తున్న రెండు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఉండవల్లి పోలీసులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ఏపీలోని కర్నూలుకు తరలించారు.బైక్ లపై వెళ్లే వారు మద్యం సేవించి నడుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.