ముంబై: దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider) బాలివుడ్ సినిమాలో నటించడంపై మహరాష్ట్రలోని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) స్పందించింది. ఈ నాటకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్చరించారు. పాకిస్థాన్లోని భర్తను వీడి తన పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చేరిన సీమా హైదర్, ప్రియుడు సచిన్ మీనాతో కలిసి ఉంటున్నది. ఈ నేపథ్యంలో వారిద్దరి లవ్ స్టోరీపై ‘కరాచీ టు నోయిడా’ పేరుతో నిర్మాత అమిత్ జానీ సినిమా తీస్తున్నారు. సీమా హైదర్ షూటింగ్లో పాల్గొన్న వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఎంఎన్ఎస్ నేత అమేయా ఖోప్కర్ దీనిపై స్పందించారు. భారతీయ సినీ పరిశ్రమలో పాకిస్థాన్ పౌరులకు స్థానం లేదని అన్నారు. దీనిపై తాము గట్టిగా నిలబడతామని తెలిపారు. భారత్లో ఉంటున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న వదంతులు కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమలో పైప్ కోసం సీమా హైదర్ను నటిగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ దేశద్రోహ నిర్మాతలకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. సినిమా నాటకానికి తక్షణం ముగింపు పలకాలని అన్నారు. లేకపోతే ఎంఎన్ఎస్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమేయా ఖోప్కర్ ఈ మేరకు మరాఠీలో ట్వీట్ చేశారు.
पाकिस्तानी नागरिकाला भारतीय चित्रपटसृष्टीत कोणतंही स्थान असता कामा नये, या आमच्या भूमिकेवर आम्ही ठाम आहोत. सीमा हैदर ही पाकिस्तानी महिला सध्या भारतात आहे. ती ISI एजंट आहे अशा बातम्याही पसरल्या होत्या. आमच्या इंडस्ट्रीमधील काही उपटसुंभ प्रसिद्धीसाठी त्याच सीमा हैदरला अभिनेत्री…
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) August 12, 2023