ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు పడగానే.. ఆయన మద్దతుదారులు జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ సమయంలో పోలీసులపై రాళ్లు రువ్వి, విధ్వంసం సృష్టించిన 10 మందిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాదు.. చెవులు పట్టుకొని… క్షమాపణలు కోరారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వీరంగం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు.
రాళ్లు రువ్విన విషయంలో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిని గుర్తించి, వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. వీరందరిపై ప్రజాభద్రత చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని ప్రకటించారు.
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.10 లక్షల జరిమానా వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. మాలిక్పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే 19న జరిగిన విచారణ సందర్భంగా ఎన్ఐఏ కోర్టు మాలిక్ను దోషిగా తేల్చింది. మాలిక్కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోరింది. అయితే కోర్టు జీవితఖైదు ఖరారు చేసింది.
Jammu & Kashmir | 10 accused have been arrested so far for anti-national sloganeering & stone-pelting outside the home of Yasin Malik prior to sentencing in Maisuma yesterday. All other areas remained peaceful: Srinagar Police pic.twitter.com/3M1fSjreXG
— ANI (@ANI) May 26, 2022