మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారని స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు, ఎమ్మెల్యే సంఘమిత్ర మౌర్య ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలే తన తండ్రిపై దాడికి దిగారని ఆయన విమర్శించారు. యూపీ ఖుషీనగర్ ప్రాంతంలోని పట్టీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వామి ప్రసాద్ మౌర్య పట్టీ గ్రామానికి ఆయన వెళ్లగా, ఈ ఘటన జరిగింది.
ఈ దాడికి నిరసగా ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే సంఘమిత్ర మౌర్య కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనపై కూడా దాడి చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ దాడిపై మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య స్పందించారు. నిర్ధారిత ప్రదేశంలోనే తాము రోడ్షో చేస్తున్నాం. ఈ సమయంలో బీజేపీ నేతలు మాపై దాడులు చేశారు. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని, కొందరు గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక రాజ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.