న్యూఢిల్లీ, ఆగస్టు 7: నైపుణ్యాభివృద్ధి పథకాలను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చేరువ చేసేందుకు ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ను సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ శనివారం ప్రారంభించారు. ‘పీఎం దక్ష్’గా పేరుపెట్టిన ఈ పోర్టల్, యాప్ ద్వారా నైపుణ్య శిక్షణ సమాచారాన్ని సులభంగా తెలుసుకుని, యువత సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.