న్యూఢిల్లీ, నవంబర్ 12: కరోనా ఉద్ధృతి తగ్గి అనేక దేశాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో భారత్లో కూడా విదేశీ సర్వీసులను పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కేంద్రప్రభుత్వానికి సూచించారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ శుక్రవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. విమాన సర్వీసుల టికెట్ల ధరలు పెరగడంపై సభ్యులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విమాన సర్వీసులపై గతేడాది మార్చి 23 నుంచి ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.