Viral Video | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి కచేరీ జరుగుతుండగా వేదిక కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు 1600 మంది హాజరయ్యారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కచేరీ చేపట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వేదిక కూలిపోవడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులకు ఎయిమ్స్, సఫ్దర్ జంగ్, మ్యాక్స్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన మహిళా భక్తురాలు వయసు 45 ఏండ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers.
(Video: Viral visuals confirmed by Fire Department) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/haaC9TZe4D
— ANI (@ANI) January 28, 2024