న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు చెందిన వెరిఫైడ్ బ్లూ టిక్(Twitter Blue Tick)ను అనేక మంది సెలబ్రిటీలు కోల్పోయారు. ఆ జాబితాలో బాలీవుడ్కు చెందిన షారూక్ ఖాన్, అమితా బచ్చన్, ఆలియా భట్ ఉన్నారు. ఇక రాజకీయవేత్తల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు.
క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు కూడా వెరిఫైడ్ బ్లూ టిక్ను తమ ట్విట్టర్ అకౌంట్ నుంచి కోల్పోయారు. ప్రస్తుతం బ్లూటిక్ కోసం నెలకు రూ. 650, సంవత్సరానికి ఒకేసారి చెల్లిస్తే రూ. 6800 వసూల్ చేస్తున్నారు. వెరిఫైడ్ బ్లూటిక్ ఇప్పటివరకు ఫ్రీగానే ఉండేది. కాకపోతే అందరికీ ఉండేది కాదు. పెద్ద పెద్ద వీఐపీలు, సెలెబ్రిటీలు, ప్రముఖులు, ఇలా ఏదో ఒక హోదానో, అధికారమో ఉన్నవారికి బ్లూటిక్ ఇచ్చేవారు. ఇప్పడు ఎవరైనా డబ్బులు కడితే వెంటనే బ్లూటిక్ ఇచ్చేస్తున్నారు. డబ్బులు కట్టని వారికి తీసేస్తున్నారు.