న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ నిడుమోలు మాలాను నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ మాలా మహాకవి శ్రీశ్రీ కుమార్తె. ఈమె గత ఏడాది మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ నక్కీరన్, జస్టిస్ సౌందర్, జస్టిస్ సుందరమోహన్, జస్టిస్ కుమరేశ్బాబును కూడా శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం జస్టిస్ మాలా మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా సేవలందిస్తున్నారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం లభిస్తే జస్టిస్ మాలాతో పాటు మరో నలుగరు న్యాయమూర్తులు శాశ్వత జడ్జిలుగా నియమితులవుతారు.