న్యూఢిల్లీ : రామాయణం ఆధారంగా రచించిన మహాకావ్యం శ్రీ రామచరితమానస్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. తులసీదాస్ రచించిన ఈ ఇతిహాసాన్ని వందల గంటల పాటు పాటరూపంలో గానం చేయడంతో అతిపెద్ద పాటగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది.
138 గంటల 41 నిముషాల రెండు సెకన్ల పాటు దీనిని గానం చేయడంతో వారణాసికి చెందిన డాక్టర్ జగదీశ్ పిళ్ళై ఈ ప్రపంచ రికార్డును స్థాపించారు. యూపీలోనే అత్యధిక గిన్నిస్ రికార్డులు సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఇంతకు ముందు అతి పెద్ద పాట రికార్డు యూకేకు చెందిన మార్కెట్ క్రిష్టోఫర్ లీ, పాకెట్ గాడ్స్ పేరుమీద ఉండేది. వారు 115 గంటల 45 నిముషాల పాటు పాట పాడి డిసెంబర్1, 2021లో రికార్డు సాధించారు.