తమ్లుక్, ఏప్రిల్ 26: పశ్చిమబెంగాల్ బీజేపీ నేత, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి పుర్బా మిద్నాపూర్ జిల్లా బీజేపీ ఆఫీస్ బేరర్ల వాట్సాప్ గ్రూప్ నుంచి సోమవారం వైదొలగడం చర్చనీయాంశమైంది. ఐదు మండలాలకు అధ్యక్షులను ప్రకటించిన కొద్దిసేపటికే గ్రూప్ నుంచి బయటకు వచ్చేశారు.
మొయినా బీజేపీ ఎమ్మెల్యే అశోక్ దిండా కూడా అంతకుముందు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. సువేందు నిర్ణయం మిద్నాపూర్లో అసమ్మతిపై మరింత ఉహాగానాలకు తెరతీసింది.