తమిళనాడు : అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఎదురు దెబ్బ తగిలింది. విప్ ఆదేశాలను ఉల్లంఘించి టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..మొదట 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పళనిస్వామి ఒక పిటిషన్ సమర్పించారని తెలిపారు.
ఈ అంశంపై పళనిస్వామి నాలుగు వేర్వేరు లేఖలు పంపారని, ఆ 21 మంది ఎమ్మెల్యేలను క్షమించాలని కోరుతూ పళనిస్వామి అసెంబ్లీకి లేఖ రాశారని, దీనినే పరిగణలోకి తీసకున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం స్వయంగా వారిని మన్నించాలని కోరినందున, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ 21 మందిపై ఎలాంటి అనర్హత చర్యలు ఉండవని స్పీకర్ స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందు రాజ్యాంగపరమైన అంశాలను, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఓటింగ్ సమయంలో ఇదే గ్రూపులో ఉన్న మరో నలుగురు ఎమ్మెల్యేలు (పెరుందురై జయకుమార్, మరకథం కుమారవేల్, ఇసక్కి సుబ్బయ్య, సత్యభామ) అంతకుముందే తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరారని వారిపై కేసులు పరిశీలనలో ఉన్నాయని, విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ప్రకటన చేస్తా మని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంతో ఏఐడీఎంకేలో రాజకీయ ముసలం అలముకున్నన్న ట్లయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొద్దిమందిపై మాత్రమే క్రమశిక్షణ చర్యలను పరిమితం చేస్తూ మెజారిటీ ఎమ్మె ల్యేలను క్షమించాలన్న పార్టీ నాయకత్వ నిర్ణయంపై పట్ల ఆ పార్టీలో కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.