చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) హర్యానా చీఫ్ నఫే సింగ్ రాథీని (Nafe Singh Rathee) ఆదివారం ఝజ్జర్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించిన కారులోనే రాథీ మేనల్లుడు రాజేష్ కూడా ఉన్నాడు. రాథీపై కాల్పులు జరిగినప్పుడు కారు ముందు సీటులో రాజేష్ కూర్చొని ఉన్నాడు. రాథీ హత్య గురించి ఆయన కుటుంబానికి చెప్పడం కోసం ప్రాణాలతో వదిలేస్తున్నట్లు హంతకులు అతడితో అన్నారు.
కాగా, నఫే సింగ్ రాథీ హత్యకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సహా నలుగురిపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నరేష్ కౌశిక్, రమేష్ రాఠీ, సతీష్ రాఠీ, రాహుల్ను నిందితులుగా గుర్తించారు. మరోవైపు రాథీ హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోమవారం తెలిపారు.
Shooters of Haryana INLD Chief Nafe Singh Rathi captured on CCtV. This is from moment before his SUV was ambushed by gunmen. pic.twitter.com/lMkaajAguN
— Raj Shekhar Jha (@rajshekharx) February 26, 2024