లక్నో, జనవరి 19: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి శుక్రవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఎన్నికలకు సం బంధించి ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదిరిందని, తమ పార్టీకి పశ్చిమ యూపీలో ఏడు సీట్లను కేటాయించినట్టు ఆర్ఎల్డీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఏయే స్థానా ల్లో పోటీ చేసేదీ ఆయన వెల్లడించ లేదు.