స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ C సిరీస్లో మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
రియల్మీ C20, రియల్మీ C21, రియల్మీ C25 స్మార్ట్ఫోన్లను భారత్లో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని C సిరీస్ ఫోన్లను విడుదల చేస్తున్నది. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లేలతో ఫోన్లు వస్తున్నాయి.
రియల్మీ సీ25లో 6000mAh బ్యాటరీ ఉండగా.. సీ21, సీ20లలో 5000mAh బ్యాటరీతో రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లను భారత్ మినహా ఇతర దేశాల్లో కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది. భారత్లో ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12:30గంటలకు ఆన్లైన్ వేదికగా రిలీజ్ చేయనుంది.