న్యూఢిల్లీ, ఆగస్టు 25: వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్ 17న నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయి.
అయితే ఈసారి పదిహేను రోజులు ముందుగానే తిరుగుముఖం పట్టనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు గురువారం పేర్కొన్నది.