Punjab | సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్లో ఓ కీలక ఘటన జరిగింది. ప్రముఖ సినీ నటుడు, కరోనా సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్లో చేరారు. ఆమె కాంగ్రెస్ తరపున బరిలోకి కూడా దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మాళవిక సూద్ పోటీ చేసే విషయంలో కాంగ్రెస్ ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతోందని తెలుస్తోంది. పంజాబ్ సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఇద్దరూ కలిసి సోమవారం మాళవికా సూద్ నివాసానికి వెళ్లారు. ఆమెతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.