కరోనా లాక్డౌన్లో ప్రజాసేవతో దేశంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తాడని చాలా ప్రచారం జరిగింది. కానీ తనకు అసలు అలాంటి ఆలోచనే లేదని సోనూసూద్ స్పష్టం చేశాడు. అయితే సోనూ సోదరి మాళవిక సూద్ మాత్రం అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు.
కాంగ్రెస్లో చేరి పంజాబ్ ఎన్నికల బరిలో దిగారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయితే పంజాబ్లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) హవా ముందు మాళవిక కూడా నిలవలేకపోయారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్దీప్ కౌర్ అరోరా ఇక్కడ ముందంజలో ఉన్నారు.
మాళవిక కన్నా దాదాపు రెండింతల ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం మాళవికకు 13వేలపైగా ఓట్లు రాగా.. అమన్దీప్కు 28 వేలపైగా ఓట్లు వచ్చాయి. ఇక్కడ మాళవిక తరఫున సోనూసూద కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె ఓటమి దిశగా వెళ్లడం గమనార్హం.