Rajyavardhan Singh Rathore | న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో సోనియా, రాహుల్గాంధీలపై బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ ఖండించారు. ఈనేపథ్యంలో రాజ్యవర్ధన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ‘నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్స్లో నేనూ ఉన్నాను. ఆనాడు సోనియా, రాహుల్ గాంధీ బీజింగ్లోని అథ్లెట్స్ విలేజ్కు వచ్చి భారత క్రీడాకారులను కలుసుకోకుండా వెళ్లిపోయారు. చైనా కమ్యూనిస్టు నాయకుల్ని కలుసుకున్నారు. వారి మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరింది. వారు దేశద్రోహానికి పాల్పడ్డారు. ఇదే పని ఓ ఆర్మీ ఉద్యోగి చేసుంటే..కోర్టు మార్షల్ను ఎదుర్కోవాల్సిందే. భారత ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వారు చైనా కమ్యూనిస్టులను కలుసుకోలేదు. శత్రుదేశమైన చైనాతో ఓ రాజకీయపార్టీ ఒప్పందం చేసుకోవటం ఇంతకు ముందెన్నడూ లేదు’ అని అన్నారు.