న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్ల ఎగుమతితో దేశంలో కొరతను సృష్టించారని కేంద్ర సర్కార్పై విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు గుమికూడవద్దని, ఎన్నికల ప్రచార ర్యాలీలను విరమించుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా మాట్లాడారు. కరోనా టెస్టులు విస్తృతంగా చేపట్టడం, రోగులను గుర్తించి చికిత్స అందించడం, వ్యాక్సినేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బాఘేల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతోందని అంతకుముందు రాహుల్ ట్వీట్ చేశారు. మహమ్మారితో కుదేలైన వలస కూలలీకు నగదు సాయం అందించాలని డిమాండ్ చేశారు.