లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందించారు. సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీతో పాటు ఫిల్మ్ స్టార్స్ అక్షయ్ కుమార్, కంగనా రౌనత్లకు కూడా ఆహ్వానం పంపారు. లక్నోలోని ఏకనా స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. రెండవసారి సీఎంగా యోగి ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 255 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.