జబల్పూర్: మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు పిస్తోల్తో షూట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జబల్పుర్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమారుడు వైభవ్ యాదవ్ వయసు 17 ఏళ్లు. ఇంట్లో ఉన్న బాత్రూమ్లో అతను షూట్ చేసుకున్నాడు. అయితే చికిత్సకు తీసుకువెళ్తున్న సమయంలో మరణించినట్లు ఎస్పీ సిద్ధార్థ బహుగుణ తెలిపారు. జబల్పుర్ జిల్లాలోని బార్గి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంటి నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వైభవ్ యాదవ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. లైసెన్సు పిస్తోల్తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.