పాట్నా, జనవరి 23: తమ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారన్న కోపంతో బీహార్లో బీజేపీ నేత, టూరిజం మంత్రి నారాయణ ప్రసాద్ కొడుకు బబ్లూ పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారి పైకి తుపాకీ ఎక్కు పెట్టాడు. ఆగ్రహావేశాలను అదుపులో పెట్టుకోలేక గాల్లోకి కాల్పులు కూడా జరిపాడు. బబ్లూ దాడిలో పలువురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో హార్దియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పిల్లలపై బబ్లూ దాడిని తెలుసుకొన్న గ్రామస్థులు మంత్రి ఇంటిని చుట్టుముట్టారు. బబ్లూను చితకబాదారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు.