బెంగళూరు : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు వావివరుసలు మరిచిపోయాడు. కామంతో రగిలిపోయిన ఆ యువకుడు నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలుకా పరిధిలోని కిదాంబడి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ఓ 58 ఏండ్ల వివాహిత తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. అయితే జనవరి 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రిస్తున్న తల్లిపై విరుచుకుపడ్డాడు. తల్లి ప్రతిఘటించడంతో ఆమె నోట్లో బట్ట ముక్కలు కుక్కి.. అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు కూడా తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో పుత్తూరు తాలుకా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది.
తనకు జరిగిన ఘోర అవమానాన్ని భరించలేక బాధిత తల్లి కుమారుడిపై పుత్తూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారుడిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కొడుకుకు పెళ్లి అయింది. కానీ భార్య తన తల్లిగారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.